ఎన్నికల్లో బ్యాలెట్ పాత్రలకు బదులు ఈవీఎం మిషన్స్ ఉపయోగించడంపై ఇప్పటికీ అనేకమందికి అనేక అనుమానాలు ఉన్నాయి.అయితే ఈ అనుమానాలను మరింత పెంచేలా … 2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని ఓ సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా ఆరోపించారు.
సోమవారం ఆయన లండన్లో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.అయితే ఈ ఆరోపణలను భారత ఎన్నికల సంఘం కొట్టిపారేసింది.
ఈ ఆరోపణలను చేసిన సుజాపై చట్టపరమైన చర్యలు ఆలోచనలో ఈసీ ఉంది.
అయితే….ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో సయ్యద్ సుజా మీడియాకు వివరించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ కూడ ఉన్నారు.
కపిల్ సబిల్ సమక్షంలో ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో ఆయన చూపించారు.ఈ సమావేశాన్ని లైవ్ ద్వారా చూపించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.సుజాపై చర్యలకు ఈసీ రంగం సిద్దం చేస్తోంది.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ కొత్త నాటాకానికి తెరతీసిందని బీజేపీ విమర్శించింది.