జంప్ కి సిద్దం గా 20 YSRCP ఎమ్మెల్యే లు ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయే రోజు దగ్గర్లోనే ఉందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి జోస్యం చెప్పారు.ఈ ఉదయం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.

 20 Ysrcp Mlas Ready To Jump???-TeluguStop.com

వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరడానికి ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారని వ్యాఖ్యానించిన ఆయన, తమ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వారంతా వస్తున్నారని, తామేమీ ప్రలోభాలు పెట్టడం లేదని అన్నారు.కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకూ విపక్షంలో ఉండి, ఇప్పుడు అధికార పక్షం వైపు చేరుతున్న వారందరినీ కలుపుకొని పోతామని, తమ మధ్య వర్గ విభేదాలు లేవని అన్నారు.

సమన్వయంతో పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, పాత, కొత్తవారు కలసి పార్టీకి అఖండ విజయం చేకూర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు.దాదాపు ఇరవై మంది వరకూ టీడీపీ కి ఒచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube