ప్రస్తుత కాలంలో కొందరు వావి వరుసలు మరచి కామందు కాలంలో మునిగిపోయి ప్రవర్తిస్తున్నారు. దీంతో తాజాగా 20 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువకుడు 90 సంవత్సరాలు కలిగిన వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కోయంబత్తూరు పట్టణ పరిసర ప్రాంతంలో “మైనుద్దీన్” అనే 20 సంవత్సరాలు కలిగిన యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఈ యువకుడు ఇంటి వద్ద ఎలాంటి పనులు చేయకుండా జులాయిగా తిరుగుతూ అప్పుడప్పుడు మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు.
ఈ క్రమంలో తాజాగా మరోమారు పీకల దాకా మద్యం సేవించి రాత్రి సమయంలో ఇంటికి వస్తుండగా ఇంటి అరుగు మీద ఆదమరచి నిద్రిస్తున్న ఓ 90 సంవత్సరాల వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు.దీంతో వృద్ధురాలు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడినుంచి పరారయ్యాడు.
అనంతరం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి వివరాలను ఆరా తీసి అరెస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అంతేగాక ఈ విషయం పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ వయసు భేదాన్ని మరిచి 90 సంవత్సరాలు కలిగిన వృద్ధిరాలిపై అత్యాచారానికి యత్నించిన నిందుతుడు మైనుద్దీన్ ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.