దారుణం : రేయ్ అని పిలిచినందుకు యువకుడు దారుణ హత్య...

ప్రస్తుత కాలంలో కొందరు ప్రతి చిన్న విషయానికి క్షణికావేశానికి లోనవుతూ ఏకంగా ఇతరుల ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా  ఓ యువకుడు తన కంటే చిన్నవాడైన మరో యువకుడిని ఒరేయ్ అన్నందుకు ఆవేశంతో వూగిపోతూ అతడిపై దారుణంగా దాడి చేయడంతో గాయాలు బలంగా తగలడంతో యువకుడు అక్కడికిక్కడే ప్రాణాలు వదిలిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

 Man Killed In Nellore, Crime News, Andhra Pradesh,-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందినటువంటి కావలి  పట్టణ పరిసర ప్రాంతంలో  ప్రవీణ్ అనే 20 సంవత్సరాల యువకుడు నివాసముంటున్నాడు.అయితే ప్రవీణ్ కుమార్ తన స్నేహితులతో కలిసి బయటకు వెళుతుండగా అదే ప్రాంతానికి చెందినటువంటి మరో యువకుడు ద్విచక్ర వాహనం మీద వెళుతూ ఒరేయ్ ఎక్కడికి వెళ్తున్నారని అంటూ అడిగాడు.

దీంతో తన కంటే చిన్నవాడైన యువకుడు తనని ఒరేయ్ అనడంతో ఇలా ఎందుకు అన్నావ్ అంటూ ప్రవీణ్ కుమార్ గొడవ పడ్డాడు.ఈ తగువులో మాట మాట పెరిగడంతో ప్రవీణ్ కుమార్ పై మరో ఇద్దరు యువకులు దారుణంగా దాడి చేశారు.

ఈ దాడిలో గాయాలు బలంగా తగలడంతో ప్రవీణ్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.ఇది గమనిస్తున్న స్థానికులు వెంటనే ఈ విషయం గురించి పోలీసులకి  అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube