యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉంది.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.
దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను పూర్తి వింటేజ్ లవ్ స్టోరీగా దర్శకుడు తీర్చిదిద్దడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమాలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే అంశాలు చాలానే ఉన్నట్లుగా తెలుస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణంగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక మరో సీక్వెన్స్ అయితే ప్రేక్షకులు నమ్మలేని విధంగా ఉండబోతుందట.ఈ ఎపిసోడ్ 20 నిమిషాల పాటు ఉంటుందని, ఇది పూర్తిగా గ్రాఫిక్స్తో చేసిన ఎపిసోడ్ అని తెలుస్తోంది.
గ్రాఫిక్స్ ఎపిసోడ్ అయితే పర్లేదు కానీ మరీ 20 నిమిషాల పాటు ఇలాంటి సీక్వెన్స్ అవసరమా అని కొందరు సందేహిస్తున్నారు.గతంలో చాలా సినిమాలు గ్రాఫిక్స్ను హైలైట్ చేయాలని చేతులు కాల్చుకున్నాయి.
ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది కాబట్టి ఆయన అభిమానులు ఆ గ్రాఫిక్స్ సీక్వెన్స్ ఎలా ఉన్నా చూస్తారు.కానీ కామన్ ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గ్రాఫిక్స్ అతిగా ఉంటే మాత్రం రాధేశ్యామ్ సినిమాలో ఆ 20 నిమిషాలు మనవి కావని వారు బయటకు వెళ్లడం ఖాయమని హెచ్చరిస్తున్నారు సినీ క్రిటిక్స్.
ఏదేమైనా ఆ 20 నిమిషాల గ్రాఫిక్స్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే రాధేశ్యామ్ థియేటర్లలోకి వచ్చే వరకు ఆగాల్సిందే.ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.