ఈమద్య కాలంలో సినిమాలు ఏ స్థాయిలో తెరకెక్కిస్తే వాటి ప్రమోషన్ కోసం వీడియోలు అంతకు మించిన స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.టీజర్ మరియు ట్రైలర్ల కోసం ప్రత్యేకంగా షూట్ చేయడం కూడా జరుగుతుంది.ఇక టీజర్ కోసం వాడే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.300 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం కోసం గత రెండేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు యావత్ దేశ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.
భారీ అంచనాలున్న సాహో చిత్రం షూటింగ్ ముగిసింది.తాజాగా సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.ఆగస్టు 15న సినిమా విడుదల చేయడం నూటికి నూరు శాతం పక్కా.ఇక సినిమా షూటింగ్ పూర్తి చేసిన నేపథ్యంలో ఇటీవలే ఒక పోస్టర్ను వదలడం జరిగింది.
ఇక త్వరలోనే టీజర్ను కూడా విడుదల చేయబోతున్నారు.టీజర్ కట్టింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.
దానికి కాస్త కంప్యూటర్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక టీజర్ కోసం ఒక హాలీవుడ్ మ్యూజిక్ బిట్ను కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.ప్రముఖ హాలీవుడ్ సినిమాకు సంబంధించిన ఆ మ్యూజిక్ బిట్ను రాయల్టీ కింద ఏకంగా 20 లక్షలు ఇచ్చి మరీ దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ఒకటిన్నర నిమిషం మ్యూజిక్ బిట్ కోసం 20 లక్షలు ఖర్చు చేస్తున్నారంటే సినిమాకు ఏ స్థాయిలో నిర్మాతలు ఖర్చు చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ చిత్రంను నిర్మిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా నటించింది.