టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా నిలిచినా చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే.ఎందుకంటే ఒక నటుడుగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా రాజకీయ నాయకుడిగా కూడా బాధ్యతలు చేపట్టాలని తన వంతు ప్రయత్నం చేశాడు.కానీ రాజకీయపరంగా పేరు సంపాదించుకోలేకపోయాడు.
ఇదిలా ఉంటే చిరంజీవి ఓడిపోతాడు అని కొందరు 20 కోట్లు బెట్ వేశారట.కానీ చివరికి ఏం జరిగిందంటే.
కొణిదెల శివశంకర వరప్రసాద్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయిన చిరంజీవి మెగాస్టార్ గా నిలిచాడు.1878 లో పునాదిరాళ్లు అనే సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకు పరిచయం అయ్యాడు.ఆ తర్వాత పలు సినిమాలలో నటించి స్టార్ హోదా ను సంపాదించుకోవడంతో ఇక వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లి మెగా స్టార్ గా నిలిచాడు.ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతూ యంగ్ హీరోలకు పోటీగా బిజీగా మారాడు.
ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఆ కారణం చేతనే తను రాజకీయాల్లోకి అడుగుపెట్టి సొంతంగా ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించాడు.
ఎందుకంటే తనకున్న అభిమానంతో రాజకీయాల్లో కూడా మంచి హోదా సంపాదించుకోవాలని అనుకున్నాడు.దాంతో మెగా అభిమానులు కూడా సంతోషంగా ఫీలయ్యారు.
ఇక కొందరు చిరు అభిమానులు చిరంజీవి ఎట్లాగైనా ముఖ్యమంత్రి అవుతాడని బెట్ వేశారు.ఆయన విమర్శకులు కొందరు ఆయన ఓడిపోతాడని ఏకంగా 20 కోట్లు బెట్ వేశారు.కానీ చివరికి చిరంజీవి ఓడిపోవడంతో ఆయన అభిమానులు చాలా ఫీల్ అయ్యారు.ఆయన గెలుస్తారన్న ఉద్దేశంతో ఎంతోమంది బెట్ లు వేసి మరీ ఆర్థికంగా నష్టపోయారు.దాంతో చిరంజీవి తనపై బెట్ కాసి నష్టపోయిన వారికి ఆర్థికంగా సహాయం చేశాడు.
ఆ సమయంలోనే చిరంజీవి రాజకీయాల కోసం సినిమాలు కూడా వదులుకున్నాడు.
ఇక రాజకీయంలో ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో అభిమానుల కోరిక మేరకు మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు.ఇక అప్పటి నుంచి చిరంజీవి వరుస సినిమాలతో ఓ రేంజ్ లో అవకాశాలు అందుకున్నాడు.
మళ్ళీ రాజకీయల వైపు చూడను కూడా చూడలేదు.కానీ ప్రజలకు తన వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తుంటాడు.
ఇప్పటికీ ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేశాడు.సొంతంగా బ్లడ్ బ్యాంకును కూడా నిర్మించాడు.కోవిడ్ సమయంలో ఆర్థికంగా సహాయం చేశాడు.ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాట్లు చేశాడు.ఇక సినీ ఇండస్ట్రీ వాళ్లకి కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటాడు.అలా రాజకీయాల్లో గెలవలేకపోయినా వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు.ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
అంతేకాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వేదళం రీమేక్ లో నటించాడానికి సిద్ధంగా ఉన్నాడు.ఈ సినిమాకు భోళా శంకర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలతో పాటు బాబి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.