నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా బిజెపి కార్యకర్తల కోలాహలానికి అవధులు లేకుండా పోయాయనే చెప్పాలి .
తమ పార్టీ పెద్దలంతా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ హడావిడి పడుతుంటే బిజెపి సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయ్ గోయల్ మోడీ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన అంటే 731 రోజులకు గానూ రోజుకు కేజీ చొప్పున 731 కిలోల మేతి చూర్ లడ్డూ లని చేయించి పంపిణీ చేసారు.
రెండు రోజుల పాటు 20 మందికి.పైగా పనివారలు తయారు చేసిన 14,000 లడ్డూ లని తూర్పు ఢిల్లీలోని ఖాజరీ చౌక్ లో ఉంచి ్రపభుత్వ పథకాలకు చెందిన 57 జండాలను ్రపదర్సించారు.
శుక్రవారం ఈ లడ్డూ ల పంపిణీ జరుగుతోంది.ఈ కార్యక్రమానికి చిన్న కేంద్ర మంత్రి మధ్య తరహా పరిశ్రమల కల్రాజ్ మిశ్రా, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజూ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
సామాన్యులకు మోడీ అందించిన పథకాలు ప్రసాదాలని, లడ్డూ లని మోడీ మహా ప్రసాదంగా అభివర్ణించారు విజయ్ గోయల్.కాగా జూన్ 5 న తల్కాటొర స్టేడియంలో మోడీ ప్రభుత్వం రెండు సంవత్సరాల విజయాలు మరియు పథకాలపై ప్రత్యేక .ఎగ్జిబిషన్ ర్పాటు చెసామన్నారు.ఈ సందర్భంగా 2కె రన్ నిర్వహిస్తామన్నారాయన
.