జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్! ఇద్దరు ఉగ్రవాదులు హతం!

ఈ మధ్య కాలంలో సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటు మరీ ఎక్కువైంది.అయితే ఇండియన్ ఆర్మీ మాత్రం ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా పక్కా ప్లాన్ తో వ్యూహాత్మకంగా వారికి అడ్డుకట్ట వేస్తుంది.

 2 Terrorists Killed In Budgam Encounter-TeluguStop.com

సరిహద్దులో చొరబడిన ఉగ్రవాదులని అక్కడే నిలువరించి ఎన్ కౌంటర్ లో హతమార్చడం ద్వారా వారికి గట్టి హెచ్చరికలు పంపిస్తున్నారు.అయిన కూడా ఉగ్రవాదులు చొరబాటుకి ప్రయత్నం చేస్తూనే వున్నారు.

మరో వైపు ఉగ్రవాదులు చొరబాటుకి అవకాశం లేకపోవడంతో జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ సానుబూతి పరులు విద్వంస చర్యలకి పాల్పడుతూ నిత్యం కాశ్మీర్ ని రణరంగంగా మార్చేస్తున్నారు.వాటిని కూడా ఇండియన్ ఆర్మీ భద్రత దళాలు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి.

తాజాగా మరో సారి జమ్మూ కాశ్మీర్ లో బుద్గా జిల్లా లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం అందుకున్న బద్రతా దలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని కాల్పులు ప్రారంభించాయి.

దీంతో ఉగ్రవాదులు నుంచి కూడా ఎదురు కాల్పులు ప్రారంభ అయ్యాయి.ఉగ్రవాదులు ఉనికిని నిర్ధారించుకున్న భద్రతా దలగాలు కాల్పులని మరింత తీవ్రతరం చేయడంతో ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

ఇంకా ఉగ్రవాదుల దాక్కుని వున్నట్లు సమాచారం వుండటంతో కాల్పులు కొనసాగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube