ఈ మధ్య కాలంలో సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటు మరీ ఎక్కువైంది.అయితే ఇండియన్ ఆర్మీ మాత్రం ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా పక్కా ప్లాన్ తో వ్యూహాత్మకంగా వారికి అడ్డుకట్ట వేస్తుంది.
సరిహద్దులో చొరబడిన ఉగ్రవాదులని అక్కడే నిలువరించి ఎన్ కౌంటర్ లో హతమార్చడం ద్వారా వారికి గట్టి హెచ్చరికలు పంపిస్తున్నారు.అయిన కూడా ఉగ్రవాదులు చొరబాటుకి ప్రయత్నం చేస్తూనే వున్నారు.
మరో వైపు ఉగ్రవాదులు చొరబాటుకి అవకాశం లేకపోవడంతో జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ సానుబూతి పరులు విద్వంస చర్యలకి పాల్పడుతూ నిత్యం కాశ్మీర్ ని రణరంగంగా మార్చేస్తున్నారు.వాటిని కూడా ఇండియన్ ఆర్మీ భద్రత దళాలు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి.
తాజాగా మరో సారి జమ్మూ కాశ్మీర్ లో బుద్గా జిల్లా లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం అందుకున్న బద్రతా దలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని కాల్పులు ప్రారంభించాయి.
దీంతో ఉగ్రవాదులు నుంచి కూడా ఎదురు కాల్పులు ప్రారంభ అయ్యాయి.ఉగ్రవాదులు ఉనికిని నిర్ధారించుకున్న భద్రతా దలగాలు కాల్పులని మరింత తీవ్రతరం చేయడంతో ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.
ఇంకా ఉగ్రవాదుల దాక్కుని వున్నట్లు సమాచారం వుండటంతో కాల్పులు కొనసాగిస్తున్నారు.