పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు.అందుకనే పెళ్లి చేసుకునే ముందు అటు ఏడూ తరాలు ఇటు ఏడు తరాలు పరిశీలించిన తర్వాతే పెళ్లి ఓకే చేసుకోవాలి.
అయితే ఇప్పటి రోజుల్లో పెళ్లి అనేది వ్యాపారంగా మార్చుకుని కొంతమంది తప్పుడు దారులు తొక్కుతున్నారు.కొత్తగా వచ్చిన యాప్స్ ద్వారా లేక మధ్య వర్తుల ద్వారా రోజు చాలా మంది అమాయకులు మోసపోతూనే ఉన్నారు.
అందుకే పెళ్లి చేసుకునే టప్పుడు తొందర నిర్ణయాలు తీసుకోకుండా ఎంక్వయిరీ చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి.లేకపోతే మోస పోవడం ఖాయం.ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా అలాంటిదే.ఒక వ్యక్తి తొందరపడి ఆలోచించకుండా మధ్య వర్తుల మాటలు నమ్మి పెళ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాతే తెలిసింది అతడికి మోసపోయడని.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది.
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి మధ్య వర్తి ద్వారా కుదిరిన సంభంధాన్ని ఎలాంటి ఎంక్వయిరీ చెయ్యకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్లి జరిగి రెండు నెలలు గడుస్తున్నా అతడి భార్య సంసారం చేసేందుకు అంగీకరించడం లేదు.మొదట్లో కొత్త కదా అని అతడు కూడా అంతగా పట్టించుకోలేదు.కానీ రెండు నెలలు అవుతున్న ఆమెలో ఎలాంటి మార్పు లేకపోవడంతో అతడు భార్యను డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు.
డాక్టర్ చెక్ చేసి చెప్పిన నిజం విని ఆ భర్త షాక్ అయ్యాడు.సెక్స్ మార్పిడి చేసుకున్న అతడి భర్య ఆ తర్వాత కూడా ఆమె సంసారం చేయలేకపోతోంది.అతడు పెళ్లి చేసుకుంది అమ్మాయిగా మారిన అబ్బాయిని అని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అవ్వడం అతడి వంతు అయ్యింది.ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసి కూడా అతడికి ఇచ్చి పెళ్లి చేయడంతో అతడు పోలీసులకు ఆమె తల్లిదండ్రులపై, మధ్య వర్తిపై ఫిర్యాదు చేసాడు.