స్టూడియో అద్దె కట్టలేక రెండు కోట్లు నష్టపోయిన కళ్యాణ్ రామ్ నిర్మాతలు

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఒక్కసారిగా సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి.వారం, పది రోజులు లాక్ డౌన్ ఉంటుంది అనుకుంటే అది కాస్తా ఏకంగా మూడు నెలలు అయ్యింది.

 2 Crores Losses To Kalyan Ram New Movie Producers, Tollywood, Corona Crisis, Ven-TeluguStop.com

ఇక లాక్ డౌన్ సడలించిన, షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చిన కూడా కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తూ ఉండటం షూటింగ్ లు మొదలుపెట్టడానికి నిర్మాతలు, దర్శకులు భయపడుతున్నారు.ఈ నేపధ్యంలో కళ్యాణ్ రామ్ హీరోగా వేణు మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కే పీరియాడికల్ మూవీ షూటింగ్ కూడా ఆగిపోయింది.

ఈ సినిమా కోసం రెండు కోట్లతో భారీ సెట్ ని ఏర్పాటు చేశారు.ఈ సెట్ లోనే షూటింగ్ జరగాల్సి ఉంది.

అయితే ఉన్నపళంగా లాక్ డౌన్ తో షూటింగ్ వాయిదా పడిపోయింది.అయితే ఆ సెట్ ని అలాగే కొనసాగిస్తే సదరు స్టూడియోని నిర్మాతలు రెంట్ కట్టాల్సి ఉంటుంది.

ఆ భారీ సెట్ కోసం స్టూడియో అద్దెను కట్టలేక నిర్మాతలు తొలగించాల్సి వచ్చిందట.దీంతో నిర్మాతలు ఈ సెట్ ని తొలగించడం వలన రెండు కోట్లు నష్టపోవాల్సి వచ్చింది.

అయితే ఈ సినిమా పీరియాడికల్ మూవీ కావడంతో ముందుగానే భారీ బడ్జెట్ అవుతుందని అనుకోని నిర్మాతలు రంగంలోకి దిగడంతో ఈ నష్టం వారికి పెద్ద సమస్య కాదని భావిస్తున్నారు.ఈ విషయంలో కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతలకి అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఏది ఏమైనా ఈ కరోనా కారణంగా సినిమా నిర్మాతలు వందల కోట్ల రూపాయిలు నష్టపోతున్నారు అనేది వాస్తవం.మరి ఈ కరోనా సమస్య ఎప్పటికి తీరుతుందో, సినిమాలు ఎప్పటికి ప్రారంభం అవుతాయో అనేది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube