అమెరికాలోని న్యూజెర్సీ లో సౌత్ ఏషియన్ ఫెస్ట్ అత్యంత వైభవంగా కన్నుల పండుగలా జరిగింది.ఈ ఈవెంట్ లో టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత టీమ్ ఎంతో అత్యద్భుతమైన ప్రదర్శనని ప్రదర్శించారు.
తన టీమ్ ఆలపించిన పాటలు తెలుగు ఎన్నారైలని విశేషంగా ఆకట్టుకున్నాయి.ఎన్నారైలని ఈ విభావరి పరవశింప చేసిందనే చెప్పాలి.ఇదిలాఉంటే
సింగర్ సునీతతో పాటు మరి కొందరు గాయనీ గాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.వీరిలో అనురుద్, శ్రుతి కూడా పాల్గొని, తమ గానామృతంతో అందరిని ఉశ్చాహ పరిచారు.జబర్దస్త్ ఫేం తో మాంచి క్రేజ్ సంపాదించికున్న అనసూయ ఈ ఈవెంట్ మొత్తానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ఎన్నారైలని తనదైన స్టైల్ లో ఎంటర్టైన్మెంట్ చేసింది అనసూయ.ఈ కార్యక్రమం అనంతరం సింగర్ సునీతకి న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ స్పెషల్ హానర్ లభించినట్టుగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ , తనకి ఈ విధమైన గౌరవం లభించడం ఎంతో సంతోషంగా ఉందని.
ఎన్నారైలు అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు