ధనవంతులు అవ్వాలంటే అంత సులువైన విషయం కానేకాదు.ధనవంతులు కావడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి….
ప్రస్తుతం ఉన్న సమాజంలో అసలు కష్టపడకుండా లక్షాధికారులు, కోటేశ్వరులైపోవాలని అందరూ కలలు కంటారు.అయితే ఇందులో చాలామంది జీవితాంతం కష్టపడిన చివరికి వారి నిత్యవసర అవసరాలు కూడా సంపాదించలేరు.
మరికొంతమందికి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంటుంది.ఇక మరికొందరికి ఆకస్మాత్తుగా అదృష్టం పట్టడంతో అనుకోని విధంగా ధనవంతులు అయిపోతారు.
అయితే ఈ విషయం అంత ఎందుకు అంటే… మీరు కూడా కష్టపడే పని లేకుండా కేవలం ఒక్క రూపాయి నోటు ఉంటే మిమ్మల్ని సులువుగా లక్షాధికారులు చేస్తుంది ఆ నోటు.
ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… చాలా మంది పాత వస్తువులను సేకరించండినికి బాగా ఇష్టపడతారు.
అలాంటి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాన్ని అందరూ పొందవచ్చు.ఇందులో భాగంగానే కొంతమంది పురాతన కాలం నాటి నాణేలను అలాగే నోట్లను పవిత్రంగా భావిస్తూ వాటిని సేకరిస్తుంటారు.
అయితే ఇందులో భాగంగానే వారి లిస్టులో ఓ రూపాయి నోటు కూడా ఉంది.ప్రస్తుతం ఈ నోటును లక్షలు పోసి సొంతం చేసుకోవాలని కొందరు సిద్ధంగా ఉన్నారు.
అదేమిటంటే 786 సిరీస్. ముఖ్యంగా ఓ మతానికి చెందిన వ్యక్తులు ఈ సిరీస్ నోట్లను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
అంతేకాదు కొందరు ఇలాంటి నోట్లను జమ చేయడం కూడా అలవాటుగా చేసుకున్నారు.ఈ మధ్య కాలంలో ఒక నివేదిక ప్రకారం ఎంతో మంది పారిశ్రామికవేత్తలు కూడా ఇటువంటి నోట్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే ఒక్క రూపాయి నోటు మీద 786 సిరీస్ ఉంటే వాటిని లక్షలు పోసి తీసుకునేవారు ఎందరో ఉన్నారు.దీనితో పాటు మాతా వైష్ణో దేవి నాణ్యం కూడా ఉన్న వారిని ధనవంతులను చేస్తుంది.
వైష్ణో దేవి ఉన్న 5,10 రూపాయల రూపంలో ప్రభుత్వం 2002 సంవత్సరంలో కాయిన్స్ ను విడుదల చేసింది.ఇక ఈ కాయిన్స్ కి ఏకంగా ఒక్క నాణానికి 10 లక్షల వరకు ధర పలుకుతున్నటు సమాచారం.
అయితే వైష్ణో దేవి ఉన్న ఫోటోను కలిగి ఉన్న కాయిన్ లను చాలామంది పవిత్రంగా భావించడంతో ఆ కాయిన్స్ కు ఇంత ప్రాధాన్యత పెరిగింది.కాకపోతే వీటిని ఆన్లైన్లో సరైన వెబ్ సైట్స్ లో వీటిని అమ్ముకోవచ్చు.