తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) తన 22 వ మహాసభలు నిర్వహించుకోవడానికి సంసిద్ధం అవుతోంది.ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేసుకున్న తానా ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాల్ని ఏర్పాటు చేయనుంది.
జూలై 4 మొదలు 6 వ తేదీ వరకూ జరిగే ఈ మహాసభల్లో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచీ ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారులు హాజరవుతున్నారు.
ఈ సభలలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న ప్రతీ కార్యక్రమానికి తానా ఒక్కో కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీల పర్యవేక్షణలో తానా సభలు నిర్వహించబడనున్నాయి.తానా ఏర్పాటు చేసే అన్ని కార్యక్రమాలలో కంటే ఎంతో ఆకట్టుకునేది మాత్రం సంగీత విభావరి అని చెప్పచ్చు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించ డానికి , ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తన బృందంతో పాల్గొంటున్నారు.
అంతేకాదు, టాలీవుడ్ గాయని సునీత లైవ్ పేరుతో ప్రత్యేక సంగీత విభావరి ఏర్పాటు చేశారు.
ఇదే కార్యక్రమంలో హైదరాబాద్ కాప్రిసియో బ్యాండ్ కూడా పాల్గొంటుంది.మరో సంగీత దర్శకుడు తమన్ కూడా తానా వేదికపై తన బృందంతో అలరించనున్నారు.
ఈసారి తానా మహాసభలలో సంగీతానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తానా సభ్యులు ప్రకటించారు.