ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్పైనే తిరుగుతుంది.ప్రతి పని డేటాపై ఆధారపడి ఉంది.
ఏ నెట్వర్క్లో తక్కువ రేటుకు ఎక్కువ డేటా వస్తుందో చూసి మారుతున్నారు డేటా ప్రియులు.డేటా లేనిదే ఇప్పుడు ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచంలో అతితక్కువ ధరలకు డేటా అందిస్తున్న టాప్ 10 దేశాల జాబితాలో భారత్, చైనా, అమెరికాలకు అందులో స్థానం దక్కలేదు.అయితే ఈ మూడు దేశాల్లో ఒక జీబీ డేటా ఖరీద కనిష్టంగా రూ.50 పైనే ఉంది.అయితే ప్రపంచంలో అతి తక్కువ ధరకే డేటాను ఇజ్రాయిల్ అందిస్తోంది.
ఈ మధ్యకాలంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే ఉంటోంది.చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి దాకా ఫోన్ వారి వెంటే ఉంటోంది.ఇక స్మార్ట్ ఫోన్ ఉందంటే ఖచ్ఛితం ఇంటర్ నెట్ తప్పనిసరి అయింది.లేదంటే ఆ ఫోన్ ఉన్నా లేనట్లే.
మనం ఏదైనా తెలుసుకోవాలంటే జేబులోకెళ్లి ఫోన్ తీసి టక టక కొట్టడమే తరువాయి.అలాంటి స్మార్ట్ ఫోన్ లో సమాచారం తెలుసుకోవాలంటే దానిలో ఇంటర్ నెట్ ఉండాలి.
ప్రస్తుతం దేశంలో ఇంటర్ నెట్ చార్జీలు చాలా తక్కువకే వస్తున్నాయి.కానీ 2016కు ముందు భారత్ లో ఇంటర్ నెట్ వాడాలంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది.
మధ్యతరగతి వారికి ఇంటర్నెట్ భారంగా ఉండేది.ఇక జియో వచ్చిన తర్వాత యావత్ భారత్నే మార్చేసింది.016కు ముందు ఒక జీబీ డేటాకు కనీసం రూ.200 వరకు ఉండేది.ప్రస్తుతం 4జీబీ డేటా రూ.200 కంటే తక్కువకే వస్తోంది.జియో దెబ్బకు టెలికాం కంపెనీలు కుదేలు అయ్యాయి.దాంతో జియోకు పోటీన ఇవ్వాలంటే రేట్లను తగ్గించక తప్పలేదు టెలికాం కంపెనీలకు.
ఈ మధ్యన అతి తక్కువ ధరకే డేటాను అందిస్తున్న దేశాలు అనే అంశాలపై పరిశీలిస్తే 221 రీజియన్లలో 6,148 మొబైల్ డేటా ప్లాన్లువివరాలు ఇలా ఉన్నాయి.భారత్ లో ఒక జీబీ డేటా రూ.50కి లభిస్తున్నట్లు తేలింది.ఇక భారత్ పక్కనున్న శ్రీలంకలో ఒక జీబీ డేటా రూ.28కే లభిస్తోంది.బంగ్లాదేశ్ లో మాత్రం ఒక జీబీ డేటా రూ.25గా ఉంది.