గేట్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ సంపాదించిన విద్యార్థి దానికి భిన్నంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు.ఈ ఘటన ఉత్తరా ఖండ్ లో చోటుచేసుకుంది.
సాగర్ షా అనే ఒక కుర్రాడు ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి ఎంటెక్ కోసం అని గేట్ ఎగ్జామ్ ని రాశాడు.అయితే అందులో 8 వేల ర్యాంకు సంపాదించిన సాగర్ మరో రెండేళ్లు చదువు పేరుతో వృధా చేసుకోవడం ఇష్టం లేక ఇప్పుడు కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచాడు.
ఎంటెక్ పేరుతో మరో రెండేళ్లు కుటుంబానికి భారం కాకూడదు అని భావించిన సాగర్ తండ్రి వ్యాపారం అయిన పకోడా బిజినెస్ లో చేరి తండ్రికి చేదోడు వాదోడు గా నిలిచాడు.షాప్కు వచ్చే కస్టమర్లకు టీ, పకోడిలు సర్వ్ చేయడమే కాక ఏ మాత్రం మొహమాటపడకుండా పాత్రలను కూడా శుభ్రం చేస్తున్నాడు.
ఈ విషయం గురించి సాగర్ను ప్రశ్నించగా.గేట్ లో ర్యాంక్ సంపాదించడం కోసం ఎంతో శ్రమించాను.
స్వంతంగానే చదువుకున్నాను.గేట్లో 8 వేల ర్యాంక్ సాధించాను.
ఆ ర్యాంక్తో నాకు మంచి ఎన్ఐటీలోనే సీటు వస్తుంది.కానీ ఎంటెక్ పేరుతో మరో రెండేళ్ల సమయం వృధా చేయదల్చుకోలేదు.దాని బదులు ఏదో ఒక పని చేసి నా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనుకున్నాను.అందుకే మా పకోడా వ్యాపారంలో భాగస్వామినయ్యాన’ని సింపుల్ గా తెలిపాడు.అయితే ఈ పకోడా బిజినెస్ ను కూడా టెక్నాలజీతో అనుసంధానం చేసి మరింత స్మార్ట్గా ముందుకు తీసుకెళ్లాలన్నదే నా కోరిక అని అన్నాడు.