ఏపీ మాజీ సీ ఎం చంద్రబాబు నాయుడు కుటుంబం తో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తుంది.ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తరువాతే ఈ పర్యటన ఉండాల్సి ఉండగా, ఓటమి పై విశ్లేషణలు చేసుకుంటూ ఇప్పటివరకు పొడిగించుకున్నారు.
ఎన్నికల సమయంలో బిజీ షెడ్యూల్ తో గడిపిన టీడీపీ అధినేత కొంత విశ్రాంతి తీసుకోవాలని భావించి విదేశీ పర్యటన వెళ్లాలని అనుకున్నారు.అయితే అప్పటి పార్టీ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు తాజగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్నీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కి ప్రత్యేక లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది.
కుటుంబం తో విదేశాలకు వెళుతున్నందున ఈ రోజు ఢిల్లీ లో జరగనున్న అఖిలపక్ష భేటీ కు ఆయన హాజరుకాలేకపోతున్నారు.విదేశీ పర్యటన ముందే ఖరారు కావడం తో ఈ సమావేశానికి హాజరు కావడం లేదని, ఈ సమావేశంపై తమ పార్టీ వైఖరి ఏంటి అన్న దానిపై కూడా ఆ లేఖ లో చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది.
ఈ నెల 24 వరకు బాబు తన కుటుంబం తో విదేశీ పర్యటన లోనే ఉండనున్నట్లు తెలుస్తుంది.
మరోపక్క ఈ అఖిల పక్ష సమావేశానికి ఏపీ సి ఎం వై ఎస్ జగన్, అలానే తెలంగాణా తరపున మంత్రి కేటీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తుంది.ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటు కానున్న ఈ అఖిలపక్ష సమావేశానికి పశ్చిమ బెంగాల్ సి ఎం మమతా బెనర్జీ కూడా దూరం కానున్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు ఆమె ప్రహ్లాద్ జోషి కి లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది.
ఈ సమావేశానికి అన్నీ రాష్ట్రాల రాజకీయ పార్టీల అధినేతలు హాజరుకావాల్సి ఉంది.అయితే పలు కారణాల దృష్ట్యా కొందరు పార్టీ అధినేతలు ఈ సమావేశానికి హాజరు కాలేకపోవడం తో వారి కి బదులుగా పార్టీ కి చెందిన మరొకరి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.