ఈమధ్య కాలంలో కొందరు అవగాహన లేమి కారణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో తమ కుటుంబాలలో తీవ్ర విషాదం నింపుతున్నారు.తాజాగా ఓ యువకుడు తన ప్రియురాలు పిలిచిందని వెళ్లి ప్రియురాలి కుటుంబ సభ్యుల చేతులలో మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని అతోరా గ్రామంలో అభిషేక్ గుజ్జర్ అనే 19 సంవత్సరాలు కలిగిన యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.కాగా ఇతడు స్థానికంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతి తో ప్రేమలో పడ్డాడు.దీంతో అప్పుడప్పుడు వీరిద్దరూ కుటుంబ సభ్యుల కళ్లుగప్పి చెట్టా పట్టా లేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు.
ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమ వ్యవహారం మిత్రుల ద్వారా యువతి ఇంట్లో తెలిసింది.దీంతో సభ్యులు ప్లాన్ చేసే తమ కూతురి ప్రియుడిని అంతమొందించాలని పన్నాగం పన్నారు.
ఈ క్రమంలో ఫోన్ ద్వారా ఫోన్ చేసి మాట్లాడాలని ఉందని వెంటనే ఒంటరిగా తనని కలుసుకోవాలని బలవంతంగా యువతితో చెప్పించారు.దీంతో పన్నాగాన్ని పసిగట్టలేకపోయిన అభిషేక్ గుజ్జర్ వెంటనే తన లవర్ ని కలిసేందుకు ఒంటరిగా వెళ్ళాడు.
దీంతో అప్పటికే కాపుకాసిన యువతి కుటుంబ సభ్యులు అభిషేక్ పై బలంగా దాడి చేశారు.దెబ్బలు బలంగా తగలడంతో అభిషేక్ గుజ్జర్ అక్కడికక్కడే మృతి చెందాడు.దీంతో భయపడిన యువతి కుటుంభ సభ్యులు మృతదేహాన్ని దగ్గరలోని చెరువులో పడేసారు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి పంచనామా నిమిత్తమై తరలించారు.అంతేకాకుండా మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఆధారంగా ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో యువతి సోదరుడు మరియు తండ్రిని అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు.