బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్.రికార్డులు తిరగరాయడానికి ఈ ఒక్క పేరు చాలు.
అందుకే ఆయనకు దేశా విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.ఆయన సినిమా వస్తుందంటే చాలు పడిగాపులు కాస్తారు.
అయితే, గత రెండేళ్లుగా షారూక్ అభిమానులకు నిరాశే మిగులుతుంది.జీరో సినిమా తర్వాత ఆయన సిని లోకానికి దూరంగా ఉన్నారు.
ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకున్న కింగ్ ఖాన్.ఇప్పుడు ఉనికి కోసం పాటు పడుతున్నాడు.
ఏడేళ్ల కింద చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాతో బాలీవుడ్లో తొలిసారి 400 కోట్ల మార్క్తో ఘన విజయం అందుకున్న షారుక్.ఆ తర్వాత ఆ స్థాయికి తగ్గ విజయాలు చేజిక్కించుకోలేకపోయారు.
హ్యాపీ న్యూ ఇయర్, ఫ్యాన్, రయీస్, దిల్ వాలే, డియర్ జిందగీ, జబ్ హ్యారీ మెట్ సెజల్, జీరో ఇలా వరుస సినిమాలు ఆయనను నిరాశే పరిచాయి.దీంతో కొంతకాలంగా షారూక్ సిని లోకానికి దూరంగా ఉన్నారు.
ఈ క్రమంలో ఆయన సినిమాల నుండి రిటైర్డ్ అయిపోయారని కూడా వార్తలు వినిపించాయి.కానీ వరుస ప్లాపులు చవిచూసిన నేపథ్యంలో షారూక్ కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని నిర్ణయం తీసుకున్నారట.
అందుకోసం ఆయన చాలా కథలను విన్నారని బాలీవుడ్ వర్గాల్లో చర్చలు కూడా జోరుగానే సాగుతున్నాయి.ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు దాదాపు 18 కథలు షారూక్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయట.
ఇందులో కొన్ని సినిమాల్లో షారూక్ నటిస్తే.మరికొన్నింటిని ఆయన నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
అయితే, రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వంలో, అట్లీ డైరెక్షన్లో షారూక్ సినిమాలు చేయాల్సి ఉంది. కరోనా క్రైసిస్ లేకుంటే ఏదో ఒక సినిమా ఈపాటికి సెట్స్పై ఉండేది.