రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు నిఖిల్.అతను చేసిన సినిమా అంటే కచ్చితంగా కాన్సెప్ట్ ఒరియాంటెడ్ తోనే ఉంటుంది అనే ఒక అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది.అందుకు తగ్గట్లుగానే అతని సినిమాలు ఎంపిక కూడా ఉంటుంది.ప్రస్తుతం ఈ కుర్ర హీరో లాక్ డౌన్ టైంలోనే తన ప్రియురాలిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు.
ఇక తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ ని ఎనౌన్స్ చేశాడు.ఇక ఈ సినిమా అతని కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ఉండబోతుంది.
ఏకంగా ఈ సినిమాని 25 కోట్లని నిర్మిస్తున్నారు.చందూ మొండేటి మరోసారి ఈ సినిమా కథకి పురాణాలు టచ్ ఇచ్చి థ్రిల్లర్ గా ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక సుకుమార్ కథతో గీతా ఆర్ట్స్ లో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ ఒక లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.18 రోజెస్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుంది.ఇది కూడా ఇప్పటికే ఓపెనింగ్ అయిపోయింది.ఇదిలా ఉంటే తాజాగా నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా మరో ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.ఏషియన్ సినిమాస్, రెయిన్ బో రీల్స్ బ్యానర్ పై ఒక సినిమాకి ఒకే చెప్పాడు.
ఈ సినిమా కూడా నిఖిల్ కెరియర్ లో మరో భారీ బడ్జెట్ చిత్రంగా ఉండబోతుందని నిర్మాతలు తెలియజేశారు.త్వరలో ఈ సినిమా దర్శకుడితో పాటు ఇతర వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు.