ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాపకింద నీరులా పాకిపోతున్న కరోనా వైరస్ ఎంతో మందిని బలితీసుకుంది.రోజురోజుకు విలయతాండవం చేస్తున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతోమంది ఆస్పత్రి పాలు చేస్తుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావం మాత్రం ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు.రోజు రోజుకూ పెరిగిపోతున్న ఈ వైరస్ కేసులతో ప్రజలందరూ తీవ్ర భయాందోళన లోనే దినదినగండంగా బతుకును వెళ్లదీస్తున్నారు.
అయితే కేరళ రాష్ట్రంలో అంతకుముందు వరకూ అతి తక్కువ కేసులు ఉన్నపటికీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం కేరళలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసుల సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు.
సామాన్యులు సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరినీ కదిలిస్తుంది ఈ మహమ్మారి కరోనా వైరస్.
తాజాగా అలువా సమీపంలో 18 మంది కాథలిన్ సన్యాసులకు కరోనా వైరస్ పాజిటివ్ అని రావడం సంచలనంగా మారిపోయింది.
సెంట్ మేరీస్ ప్రావిన్స్ కి చెందిన ఈ సన్యాసిలందరు … కుజిపల్లి లోని 71 ఏళ్ల సన్యాసిని తో కలిసి నందు వల్లే కరోనా వైరస్ బారిన పడ్డారు అని వైద్యులు నిర్ధారించారు.జూలై 11వ తేదీన సదరు వృద్ధ సన్యాసి కరోనా తో మృతి చెందింది.
ప్రస్తుతం ఈ సన్యాసినులు అందరికి క్వారంటైన్ సెంటర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.