భారత ప్రధాని నరేంద్ర మోది నేడు హైదరాబాదులో పర్యటిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి.
ప్రధాని టూర్ ను ప్లాప్ చేసేందుకు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఒక వైపు ప్రయత్నాలు చేస్తుండగా, బీజేపీ నేతలు వాటిని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే ప్రధాని నరేంద్ర మోది రాకను నిరసిస్తూ ఆయనకు నిరసన తెలిపేందుకు హైదరాబాద్ నగరంలో 17 చోట్ల 17 ప్రశ్నలతో కూడిన 17 బ్యానర్లు వెలిశాయి.
ఇందులో తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ ఈ బ్యానర్ లను ఏర్పాటు చేశారు.ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. 1.మోడీ జీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీలు కూడా ఎందుకు మంజూరు చేయలేదు ? 2.తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎక్కడ ఉంది ? 3.తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయలేదు ?
4.కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు ? 5.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఎక్కడ ఉంది ? 6.కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏది ?
7.గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను హైదరాబాద్ నుంచి గుజరాత్ కు ఎందుకు తరలించారు ?
8.తెలంగాణకు కొత్తగా నవోదయ విద్యాలయాలు ఎందుకు మంజూరు చేయడం లేదు ? 9.నిజామాబాద్ లో పసుపు బోర్డు ను ఎందుకు ఏర్పాటు చేయలేదు ?.10.బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ ? 11.తెలంగాణకు ఐ టీ ఐ ఆర్ ఎక్కడ ? 12.తెలంగాణకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏది ?
13.నీతి అయోగ్ చెప్పినప్పటికీ మిషన్ భగీరథ నిధులు ఎందుకు ఇవ్వలేదు ? 14.హైదరాబాద్ కు వరద సహాయం ఎందుకు చేయలేదు ? 15.తెలంగాణకు మెగా పవర్ లూమ్, టెక్స్ టైల్ క్లస్టర్ ఒక్కటి కూడా ఎందుకు మంజూరు చేయలేదు ? 16.ఫార్మా సిటీకి ఆర్థిక సహాయం ఏమైనా చేశారా ? 17.తెలంగాణకు ఐ.ఐ.ఎం ఎక్కడ ?