భారత ప్రభుత్వం రికార్డ్ సృష్టించింది.విదేశాలలో చిక్కుకుపోయి ఎన్నో కష్టాలు పడుతూ, ఆర్ధికంగా, మానసికంగా కష్టాలు పడుతున్న ఎంతో మంది భారతీయులని అక్కున చేర్చుకుంది.
మన దేశానికి రండంటూ ఆప్యాయంగా ఆహ్వానం పలికింది.ఇందుకు వందే భారత్ మిషన్ ఏర్పాటు చేసి ఎన్నారైల కళ్ళల్లో వెలుగులు నింపింది.
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది భారతీయులు వివిధ దేశాలలో చిక్కుకుని పోయారు.చాలా మంది ఉద్యోగాలు కోల్పవడమే కాకుండా ఆర్ధికంగా చితికి పోయారు…దాంతో
ఎన్నారైలు అందరూ తమని భారత్ తీసుకువెళ్ళమని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన కేంద్రం వందే భారత్ మిషన్ ఏర్పాటు చేసింది.
పలు దఫాలుగా ఎన్నారైలను ప్రత్యెక విమానాల ద్వారా భారత్ తీసుకురావడమే కాకుండా వారిని వారి సొంత ప్రాంతాలకి తరలించడంలో కూడా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసింది.అత్యధికంగా అమెరికా నుంచీ పెద్ద ఎత్తున ఎన్నారైలు భారత్ వచ్చినట్టుగా కేంద్రం ప్రకటించింది.ప్రస్తుతం
వందే భారత్ మిషన్ – 6 కొనసాగుతోంది.ఈ మిషన్ లో భాగంగా సెప్టెంబర్ 5 వ తేదీన వివిధ దేశాల నుంచీ సుమారు 4 వేల మంది భారతీయ ఎన్నారైలు భారత్ చేరుకోగా.
ఈ మిషన్ మొదలైన నాటి నుంచీ నేటి వరకూ సుమారు 15 లక్షల మంది భారతీయులు భారత్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఇందులో సుమారు 5 లక్షల మంది విమానాల ద్వారా స్వదేశానికి చేరుకోగా, 10 లక్షల మంది వివిధ రకాలుగా భారత్ చేరుకున్నారని విమానయాక శాఖామంత్రి గురుప్రీత్ సింగ్ ప్రకటించారు.