భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే త్రివర్ణ పతాకం చూడగానే గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది.ఆ జెండా చేతుల్లో పట్టుకోగానే ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతాడు.
అయితే ప్రతి ఒక్కరిలో హృదయ పతాకంగా నిలిచే ఈ త్రివర్ణ పతాకం విశ్వ వేదికలమీదతో సహా ప్రపంచంలోని ప్రతి మూలా రెపరెపలాడి మనందరికీ గర్వకారణంగా నిలిచింది.అందరికంటే ఎక్కువగా భారత జవాన్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంటారు.
అది చూసిన మిగతా భారతీయులందరూ గర్వంగా ఫీల్ అవుతుంటారు.సెల్యూట్ చేస్తూ దేశ భక్తిని చాటుకుంటారు.
అయితే తాజాగా ఇండియన్ ఆర్మీ జాతీయ జెండాను అత్యంత ఎత్తైన ప్రదేశంలో రెపరెపలాడించి అందర్నీ ఫిదా చేస్తున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జెండాను భారత సైన్యం ఎగురవేసింది.
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లోని హాన్లే వ్యాలీలో 15 వేల అడుగుల అత్యంత ఎత్తయిన ప్రదేశంలో 76 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు ఆర్మీ అధికారులు.ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ జెండాను ఎగురవేసి.
దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.కాగా ఈ వీడియో ప్రస్తుతం అందరి మనసులను హత్తుకుంటోంది.
ఇదిలా ఉండగా 2020లో లద్దాఖ్, జమ్ముకశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే ఆ తర్వాత తూర్పు లద్దాఖ్లో చైనాతో భారత్కు సరిహద్దు సమస్యలు మరింత ఎక్కువ అవుతున్నాయి.భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ ప్రయత్నాలను భారత ఆర్మీ సమర్థవంతంగా అడ్డుకుంటోంది.ఈ క్రమంలో ఈ సమస్యలపైనే త్వరలో రెండు దేశాల సైనికాధికారులు మరోసారి చర్చించనున్నారు.