100 ఏళ్ల క్రితం మన భారత దేశం ఎలా ఉందో చూడండి.! 15 అరుదైన చిత్రాలు ఇవే..!

అప్పుడప్పుడు ఇల్లు సర్దుతున్నప్పుడో మరేదన్న సంధర్బంలోనో.ఇంట్లో అల్మారాలో ఉన్నా ఆల్బం బయటపడుతుంది.

 15 Rare Indian Photos That Will Take You Back In Time-TeluguStop.com

అప్రయత్నంగానే ఓపెన్ చేస్తాం ఒక్కో ఫోటోను చూస్తు మనకు తెలియకుండానే గతంలోకి వెళ్తాం.దానికోసం మనకు ఏ టైం మిషన్ అక్కర్లేదు.

గతం తాలుకు జ్ణాపకాలెప్పుడు మనసుని తడుముతాయి.ఆనందంలో తేలియాడేలా చేస్తాయి.

అదే మన దేశానికి సంభందించిన అతి పురాతన విషయాలైతే చూసినప్పుడల్లా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.అప్పటి పరిస్థితిల్లో ట్రావెల్ చేసేలా చేస్తాయి.అలాంటి ఫోటోలు కొన్ని మీకోసం.

1.ఇది భారతదేశం యొక్క మొదటి టెస్ట్ క్రికెట్ జట్టు.మొదటి టెస్ట్ మ్యాచ్ 1932 లో ఇంగ్లాండ్లో జరిగింది.

2.మీరు షారుక్ ఖాన్, కపిల్ దేవ్ మరియు సోహైల్ ఖాన్లను గుర్తించారా ఈ ఫొటోలో.స్టార్స్ కి,ప్లేయర్స్ కి జరిగిన పుట్ బాల్ మ్యాచ్ పిక్ ఇది.

3.బ్రిటీష్ వారి పాలనలో భారతీయులే వారికి సేవలు చేసే వారు.ఆ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించేదే ఈ చిత్రం.

4.భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన సమయంలో 1947 అప్పటి ఫొటో ఇది.రెండు దేశాల మధ్య ఫైళ్లను పరీశిలిస్తున్న వ్యక్తి తలపట్టుకుని కూర్చున్న దృశ్యం.

5.భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి మెర్సిడెజ్ బెంజ్ టెల్కో కార్ ఇది.1954లో టాటా మోటార్స్ ద్వారా ముంబై కి తీసుకురాబడింది ఈ కార్.

6.హూమాయున్ టూంబ్.ఈ సమాది చుట్టూ తోటతో నిర్మించబడింది.ఈ విధంగా భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి సమాధి.1565 లో ప్రారంభమై న ఈ సమాది నిర్మాణం 1572 AD లో పూర్తయింది.

7.భారతదేశంలోని కలకత్తాలో, 1930 లో, ధనవంతులైన ప్రజలు జీబ్రాను గుర్రపు బండిని లాగడానికి ఉపయోగించారు.ఇది రాయల్టీకి చిహ్నంగా కూడా భావించేవారు.

8.చాలా చాలా అరుదైన చిత్రం ఇది.దీంట్లో మీరు ఇద్దరు మహారాణులను చూడొచ్చు.ఒకరు క్వీన్ ఎలిజబెత్,మరొకరు మహారాణి గాయత్రి దేవి.

అప్పట్లో రాజులు,రాణులువేటకు వెళ్లేవారనే విషయాలు మనకు తెలుసు.ఆ సంధర్బమే మనకు ఈ ఫొటోలో కనపడుతుంది.

9.సుమారు 100 ఏళ్లక్రితం క్యాప్చర్ చేయబడిన తాజ్ మహల్ ఫొటో ఇది.దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనికి చెందిన డా.జాన్ మూర్ తీసారు.

10.భారతదేశపు మొట్టమొదటి ప్రధమ పౌరుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్.గుర్రపు బండిలో ఊరేగుతున్నప్పటి ఫొటో ఇది.

11.ఇది 1946 డిసెంబర్ 9 న, భారత రాజ్యాంగ అసెంబ్లీ మొదటి సమావేశం.ఈ ఫొటోలో వల్లబాయ్ పటేల్,నెహ్రూ,అంబేధ్కర్ తదితరులను గమనించవచ్చు.

12.ముంబైలో బ్రియాన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) నిర్వహణ గురించి మీరు వినే ఉంటారు కదా .ఇది మొట్టమొదటి సారిగా 1907 లో మొదటి ఎలెక్ట్రిక్ ట్రామ్ ముంబై నగరం ద్వారా ప్రవేశించింది, భారతదేశంలో, ట్రాములు ఇంకా కోల్కతాలో పనిచేస్తున్నాయి.1954 లో చెన్నైలో మరియు 1960 లో ముంబైలో ట్రామ్లను నిలిపివేశారు

13.ఎయిర్ ఇండియా అటెండెంట్ ,ఫ్లైట్ టైమింగ్స్ ను బొర్డు పై రాస్తున్న ఈ ఫోటో 1963లోది.

14.1940 లో పెషావర్ లోని ఫోటో ఇది.అప్పటి సైన్ బోర్డ్స్ అన్ని పంజాబీలో లేదా ఉర్దూలో ఉండడాన్ని ఈ పోటోలో గమనించొచ్చు.

15.టైమ్స్ ఆఫ్ ఇండియా డైమండ్ జూబ్లీని జరుపుకున్నప్పటి ఫొటో ఇది.1989లోది ఈ పిక్చర్.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube