సికింద్రాబాద్.ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అత్తిలి అరుణ కుటుంబ సభ్యులు తొలి బోనాన్ని సమర్పించారు.తొలి బోనం సందర్భంగా పశు సంవర్డాక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బోనం తీసి డప్పు వాయిద్యాలతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కి సమర్పించారు.జోగిని శ్యామల ఆధ్వర్యంలో బోనం ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు..
ప్రయివేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
బోనాల ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు 3500 కు పైగా ప్రభుత్వ, ప్రయివేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం పంపిణీ చేస్తామన్నారు.