రేపు తెలంగాణాలో ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్ తో సహా, రాష్ట్రం అంతటా 144 సెక్షన్ విధిస్తున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.అలాగే రేపు ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కూడా అధికారులు ఆదేశించారు.
అలాగే కౌంటింగ్ కేంద్రాలతో సహా ఎక్కడైనా 5 కంటే ఎక్కువ మంది గుమగుడవద్దని అధికారులు సూచించారు.
మద్యం దుకాణాలు 11వ తేదీ ఉదయం నుండి 12వ తేదీ ఉదయం వరకు తెరవకూడదని… కల్లు తో సహా అన్ని బార్ అండ్ రెస్టారెంట్ లను, మిలిటరీ క్యాంటిన్ లకు కూడా ఇది వర్తిస్తుందని అధికారులు హెచ్చరించారు.అధికారుల అనుమతులు లేకుండా… ర్యాలీలు, ఊరేగింపులు వంటివి జరిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా కాల్చరాదని, పరిమితిని మించి పెద్ద శబ్దాలు చేసే వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు