శాంతి భద్రతల పరిరక్షణలో ముందస్తు భాగంగా… ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈనెల 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు సీఆర్పీసీ సెక్షన్ 144 అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు.ఇప్పటికే ఖమ్మం కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని, మరికొన్ని రోజుల పాటు ఇది కొనసాగనుందని కమీషనర్ తెలిపారు.
పోలీసు ఆంక్షల కారణంగా అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు.ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా చేరటం, తిరగటం నిషేధించామన్నారు.ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలతో పాటు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు సహకరించాల్సిందిగా కమిషనర్ కోరారు.