సమాజంలో రోజు రోజుకు దారుణాలు పెరిగి పోతున్నాయి.పెరుగుతున్న టెక్నాలజీ కారణమో లేదా మరేంటో కాని చిన్న పిల్లల్లో కూడా క్రూరమైన మనస్థత్వం ఏర్పడుతోంది.
చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరగడం పెద్ద కొత్తేం కాదు.కాని చిన్న కుర్రాళ్లు కూడా ఇప్పుడు అఘాయిత్యాలకు పాల్పడటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
దేశంలో ఎన్నో నేరాలు ఘోరాలు పెరుగుతున్నాయి.
తాజాగా గుజరాత్లో జరిగిన సంఘటన దేశంలో ఉన్న అత్యంత దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది.11 ఏళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యంత దారుణంగా అఘాయిత్యం చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఆడుకుందాం అంటూ తీసుకు వెళ్లిన ఆ కుర్రాడు పొదల్లో బాలికపై అఘాయిత్యంకు పాల్పడ్డాడట.
బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది.దాంతో షాక్ అయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
9వ తరగతి చదువుతున్న కుర్రాడు గత కొన్ని రోజులుగా ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడట.
ఆ విషయంను బాలిక తల్లిదండ్రులకు చెప్పి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు.కాని బాలిక తెలిసి తెలియక ఏం చెప్పలేదని పోలీసులు అంటున్నారు.ఇలాంటి సంఘటనలు చాలా సీరియస్గా తీసుకోవాలని మహిళ సంఘాల వారు అంటున్నారు.
గుజరాత్లోని బనస్కంత జిల్లాలో ఈ దారుణం జరిగింది.బాలుడు మైనర్ అవ్వడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించలేక పోతున్నారు.376 సెక్షన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ముందు బాలుడిని విచారించారు.మైనర్ కనుక పెద్దగా శిక్ష ఉండక పోవచ్చు అంటూ కొందరు భావిస్తున్నారు.
ఇలాంటి సంఘటనలతో దేశం ఎటు వెళ్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ నీచమైన సమాజంలో చిన్న పిల్లలకు కూడా భద్రత లేకుండా పోయిందని కన్న తల్లులు కన్నీరు పెట్టుకుంటున్నారు.