14 ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం...చూశాడని కొడుకుని చంపిన తల్లి.! అసలేమైంది.?

అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న జీవిత భాగ‌స్వామిని మోసం చేస్తూ ఇత‌రుల‌తో అక్ర‌మ సంబంధాలు పెట్టుకునేందుకు నేటి త‌రుణంలో కొంద‌రు దేనికీ వెనుకాడ‌డం లేదు.అవ‌స‌రం అనుకుంటే ఆ జీవిత భాగస్వామిని కూడా త‌మ అక్ర‌మ సంబంధం కోసం అంత‌మొందిస్తున్నారు.

 14 ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం...-TeluguStop.com

ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉన్నాయి.కానీ 14 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం అడ్డొచ్చిన కొడుకునే చంపేసింది ఆ మహిళ.

తల్లి అనే పదానికే మచ్చ పడేలా చేసింది ఆ నీచురాలు.అసలేమైందో వివరాలు చూడండి.

పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది
మొండల్ పారా ప్రాంతానికి చెందిన రాజాపూర్ గ్రామ నివాసి గోస్తో మొండల్ భార్య సాగరి (28).ఈ దంపతులకు ఏడేళ్ల చిన్నారి సాధన్ ఉన్నాడు.వీరి పొరుగింటికి చెందిన సచ్చింద్రనాథ్ సర్దార్ తన భార్యతో కలిసి కోల్‌కతాలో నివాసం ఉంటున్నారు.కానీ, అతడి కుమారులు రిషి (14), ఆనంద్ (12) సొంతూరులోనే ఉంటూ విద్యాభ్యాసం సాగిస్తున్నారు

28 ఏళ్ల ఆ మహిళ తన ఇంటి పక్కనే ఉన్న 14 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

వారిద్దరూ ఏకాంతంగా ఉండగా చూసిన పాపానికి ఆమె తన ఏడేళ్ల కొడుకును అతి దారుణంగా గొంతు నులిమి హత్య చేసింది

రిషితో సాగరి చనువు పెంచుకుంది.తన భర్త గోస్తో బయటకి వెళ్లినప్పుడల్లా ఆ బాలుణ్ని ఇంటికి రప్పించుకొని శారీరక వాంఛ తీర్చుకుంటోంది.

గత గురువారం (మే 24) సాధన్ ఆరుబయట ఆడుకుంటుండగా.గోస్తో ఇంట్లో లేని సమయం చూసి రిషి.

సాగరి వద్దకు వచ్చాడు.వారిద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా.

ఆరుబయట ఆడుకుంటున్న సాధన్ అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చాడు

తన తల్లితో రిషి అసభ్యకరంగా ఉండటాన్ని చూసి షాక్‌కు గురైన సాధన్.ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతానంటూ అతణ్ని బెదిరించాడు.

అరుస్తూ బయటకు పరుగు తీయడానికి సిద్ధమవుతున్న కుమారుడు సాధన్‌ను పట్టుకొమ్మని రిషిని సాగరి పురమాయించింది.దీంతో అతడు వేగంగా వచ్చి సాధన్‌ను గట్టిగా పట్టుకున్నాడు.

అతడిపై పిడిగుద్దులు కురిపించాడు.ఇంతలో సాగరి వచ్చి తన కుమారుడి మెడకు చున్నీతో ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చింది.

ఆ తర్వాత వారిద్దరూ కలిసి గుట్టు చప్పుడు కాకుండా సాధన్ మృతదేహాన్ని సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పూడ్చిపెట్టారు.ఆ తర్వాత ఆమె కపట నాటకానికి తెరతీసింది.ఎప్పటిలాగే ఇంటికి తిరిగొచ్చిన భర్త గోస్త్‌ వద్ద తన కుమారుడు సాధన్ కనిపించడం లేదంటూ కంటతడి పెట్టుకుంది.చుట్టుపక్కల గాలించిన గోస్త్.బాలుడు సాధన్ ఆచూకీ దొర్కపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సాగరి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని పలు కోణాల్లో ప్రశ్నించారు.చివరికి ఆమె తన నేరాన్ని ఒప్పుకుంది.తన గుట్టు రట్టవుతుందనే భయంతోనే కన్న కుమారుణ్ని కడతేర్చినట్టు అంగీకరించింది.ఆమెతో పాటు మైనర్ బాలుడు రిషిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.సోమవారం వారిద్దరినీ వెంటబెట్టుకొని వెళ్లి సాధన్ మృతదేహాన్ని వెలికితీశారు.

అనంతరం రిషిని జువైనల్ హోమ్‌కు తరలించారు.మైనర్ బాలుడితో సంబంధం పెట్టుకొని కన్న కొడుకునే హత్య చేసిన కిలాడీ లేడీ సాగరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube