మనం ఉన్నది 2020లో అయినా ఇప్పటికి 1950, 60 కాలంలో జరిగేవే జరుగుతున్నాయి.అధికారులు అయినా ఎన్ని అని ఆపుతారు.
ఎంత ప్రయత్నించినా సరే 100కు 5 మంది అయినా చిన్నారి పెళ్లికూతుర్లు అవుతున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలో ఓ బాల్య వివాహం జరిగింది.అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ బాల్య వివాహంలో 13 యేళ్ళున్న బాలికకు అప్పటికే భార్య చనిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న 37 ఏళ్ళ వ్యక్తి వివాహం చేస్తుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ అనే వ్యక్తి షాద్ నగర్ లో ఓ మద్యం దుకాణంలో పని చేస్తుంటాడు.అతని భార్య కొంతకాలం కిందట చనిపోయింది.
ఇంకా అతనికి 10 ఏళ్ళ బాలుడు, 8 ఏళ్ళ బాలిక ఉన్నారు.అదే గ్రామంలో తన కూతురు కంటే 5 ఏళ్ళు పెద్దది అయినా ఓ బాలికపై ఈ నీచుడు కన్ను పడింది.
అయితే ఆ బాలిక తల్లి వ్యవసాయ కూలీ.ఇంకా ఆమెతో అతనికి కుటుంబ స్నేహం ఉండటంతో ఒత్తిడి తెచ్చి ఈ నెల 15న ఆ బాలికను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఈ విషయాలు బయటకు రావడంతో ఐసీడీఎస్, రెవిన్యూ అధికారులు, పోలీసులు రంగంలోకి ఆ బాలిక, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.ఇక మల్లేష్ పరారీలో ఉన్నాడు.
.