పొరుగుదేశం పాకిస్థాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లో 13 ఎల్లా హిందూ బాలిక పై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
గతనెలలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సింధ్ ప్రావిన్స్లోని తాండో మొహమ్మద్ ఖాన్ జిల్లాలో 13 ఏళ్ల బాలిక ఇంట్లో సరుకుల కోసం బయటకు వెళ్లింది.
అయితే, ఆమె ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను పిలిచి మద్యం తాగాలంటూ బలవంతం చేశారు.అనంతరం ఆమెను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ మిల్లు వద్ద అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది.
అయితే మరోపక్క కిరాణా సామగ్రి తీసుకురావడానికి వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి రాకపోవడం తో ఆ బాలిక తల్లిదండ్రులు ఆమె కోసం గాలించగా చివరికి మిల్లువద్ద దుర్భర పరిస్థితుల్లో కనిపించింది.దీనితో వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తరలించి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడం తో విషయం బయటకు వచ్చింది.అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.