గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 13 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
పూర్తి విషయంలోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రంలో బన్సవరా జిల్లాకు చెందిన వలస కూలీలు కిమ్ చార్ రాస్తా వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తుండగా.అతి వేగంగా వచ్చిన ట్రాక్ వీరిపై నుంచి దూసుకెళ్లింది.
దీంతో వెంటనే అక్కడికక్కడ 13 మంది వలస కార్మికులు మరణించడం జరిగింది.నలుగురు తీవ్రంగా గాయపడటంతో అక్కడ ఉన్న స్థానికులు వారిని సమీపంలోని హాస్పిటల్లో జాయిన్ చేశారు.ఈ క్రమములో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.ఇదిలా ఉండగా ఫుట్ పాత్ పై మరణించిన వారిని చూసి చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు.
.