స్మార్ట్ ఫోన్ కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా.మొబైల్స్కు అట్రాక్ట్ అయిపోతున్నారు.
ఇక సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ప్రయోగాన్ని సొంతంగా ట్రై చేస్తున్నారు.ఇక ప్రస్తుతం కాలంలో ఫ్యాషన్ పిచ్చి ఏ రేంజ్లో పెరిగిపోయిందో చెప్పాల్సిన పనిలేదు.
సోషల్ మీడియాలో ఏం చేసిన ట్రెండ్ అవుతూనే ఉంది.ఇక అందులో కనిపించే ఫ్యాషన్ మోడల్స్ గురించి తెలిసిన విషయమే.
కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు.అబ్బాయిలకు కూడా రకారకాల ఫ్యాషన్ డిజైన్స్ సోషల్ మీడియాలో కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటాయి.
ఇటీవల ఓ డిఫరెంట్ హెయిర్ స్టైల్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.అదేంటంటే.
తలపై కిరోసిన్ పోసి.మంట వెలిగించి.స్పీడ్గా ఆ మంట ఆరేలోపు దువ్వేయ్యాలి.ఇదోరకమైన హెయిర్ స్టైల్.అయితే ఇది కేవలం నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సిన పని.కానీ సోషల్ మీడియా పుణ్యామా అని ప్రతి ఒక్కరు దీనిని ట్రై చేస్తున్నారు.ఇందులోనే ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలున్నాయి.తాజాగా ఇలాంటి దారుణం కేరళలో జరిగింది.
కేరళలోని తిరువనంతపురంలోని వెంగనూర్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల శివనారాయణన్ ఏడవ తరగతి చదువుతున్నాడు.అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.
అందులోని లేటెస్ట్ ట్రెండ్స్కు తగ్గట్టుగా మారేందుకు ప్రయత్నిస్తుంటారు.ఈ క్రమంలోనే శివనారయణన్ ఇటీవల యూట్యూబ్లో ఈ సరికొత్త హెయిర్ స్టైల్ వీడియో చూశాడు.
అందులో తలపై మంటపెట్టి హెయిర్ స్ట్రెయిట్నింగ్ చేశారు.అంతే ఇంకేముంది చూసిన వెంటనే అది తెగ నచ్చేసింది.
ఎలాగైన ఆ హెయిర్ స్టైల్ తాను ట్రై చేయాలి అనుకున్నాడు.వెంటనే బాత్రూమ్కు వెళ్లి.
తలపై కిరోసిన్ పోసుకొని నిప్పుపెట్టుకున్నాడు.ప్రయోగం బెడిసికొట్టి తలపై పెద్ద మంటలు అంటుకున్నాయి.
తీవ్ర గాయాలతో విలవిల్లాడిపోయాడు.ఆ సమయంలో ఇంట్లో అతడి నానమ్మ మాత్రమే ఉంది.
ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల ప్రజలు వచ్చి మంటలను ఆర్పివేశారు.తీవ్ర గాయాల పాలైన శివనారాయణన్ను ఆస్పత్రికి తరలించారు.
కానీ చికిత్స పొందుతూ అతడు మరణించాడు.శివనారాయణన్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా.తమ పిల్లలు సోషల్ మీడియాకు ఎంత అట్రాక్ట్ అయి ఉన్నారనే విషయాన్ని అప్పుడప్పుడూ గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.