రోజురోజుకీ మానవత్వం మనుషుల్లో చచ్చిపోతుంది అనడానికి అప్పుడప్పుడు సాక్షాలు కనిపిస్తూ ఉంటాయి.ఇక తాజాగా ఇలాంటి ఓ సాక్ష్యం మన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఈ సంఘటన చూసినవారంతా అయ్యో పాపం అంటూ బాధితుడికి తమ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇంతకీ అసలేం జరిగిందంటే నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ ఏరియాలో ఒక ప్రబుద్ధుడు ఒక 12ఏళ్ల బాలుడిని పనిలో పెట్టుకున్నాడు.
దేశంలోని బాల కార్మిక చట్టం ప్రకారం చిన్న పిల్లలను పనిలో పెట్టుకోకూడదు.ఆ విషయం తెలిసి కూడా ఓ ప్రబుద్ధుడు 12ఏళ్ల బాలుడిని పనిలో పెట్టుకున్నాడు.
ఆ బాలుడు పనికి రాకపోవడంతో అతని కాళ్ళకు తాడు కట్టి అందరూ చూస్తుండగానే బాలుడిని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు.ఆ యజమానిని కొట్టవద్ధని బాలుడు ఎంత ప్రధేయ పడినా అతడు బాలుడిని కనికరించకుండా చెట్టుకు కట్టి చితకబాదాడు.
ఈ తతంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఆ బాలుడి పై అమానుషంగా వ్యవహరించిన యజమానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
అక్కడ ఉన్నవారందరి ముందు ఆ యజమాని అంత అమానుషంగా బాలుడిపై వ్యవహరిస్తున్న ఒక్కరు కూడా కలగ చేసుకోకపోవడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.చిన్న పిల్లల పై ఇంత అమానుషంగా వ్యవహరిస్తున్న వారిని అధికారులు కఠినంగా శిక్షించాలి లేకుంటే ఇలాంటి ఘటనలు మళ్లీ చూడాల్సివస్తుంది