దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు మరీ దారుణంగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో వినకూడని, చెప్పకూడని విషయాలు జరుగుతున్నాయి.
ఈ దేశం ఎటు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్న ఇండియాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది.10 ఏళ్ల అమ్మాయి కడుపు నొప్పి అంటూ తల్లిదండ్రులకు చెప్పడంతో, ఆ తల్లిదండ్రులు ఆ పాపను హాస్పిటల్కు తీసుకు వెళ్లారు.వైధ్యులు ఆ 10 ఏళ్ల బాలిక కడుపులో పిండం ఉందని, ఆ పాప తల్లి కాబోతుంది అంటూ తేల్చి చెప్పారు.
ఈ విషయం ఆ తల్లిదండ్రులకు మాత్రమే కాదు యావత్ భారతానికే కన్నీరు తెప్పిస్తుంది.
కేవలం పది సంవత్సరాల బాలికను తల్లి చేసిన ఆ దుర్మార్ఘుడు ఎవరు అంటూ అంతా వాకబు చేస్తున్నారు.
అతడు కూడా చిన్న పిల్లాడే అని తేలిసి మరింత నోరెళ్లబెడుతున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
మహారాష్ట్ర ఫల్ఘర్కు చెందిన పదేళ్ల పాపను కడుపు నొప్పి కారణంగా హాస్పిటల్కు తీసుకు వెళ్లగా ఆ పాప కడుపులో పిండం ఉందని గ్రహించిన వైధ్యులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారికి ఏం చేయాలో పాలుపోలేదు.ఆ పాపను ప్రశ్నించగా ఒక కుర్రాడు కొన్ని నెలలుగా తనను రేప్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.
ఆ కుర్రాడి వల్లే పదేళ్ల బాలిక తల్లి కాబోతుందని పోలీసులు కూడా నిర్థారణకు వచ్చారు.
కేవలం 12 ఏళ్ల కుర్రాడు ఇంతటి అఘాయిత్యంకు ఒడి కట్టాడు అంటే ఎవరు కూడా నమ్మడం లేదు.అమెరికాలో అప్పుడప్పుడు ఇలాంటివి వింటూ ఉంటాం.కాని ఇండియాలో ఇంత చిన్న వయసు పిల్లలకు సంబంధించి ఇలాంటి వార్త వినాల్సి రావడం అత్యంత దారుణమైన పరిస్థితి అంటూ దేశ వ్యాప్తంగా జనాలు అవాక్కవుతున్నారు.
ఇటీవలే తమిళనాడులో ఇలాంటి సంగటన జరిగింది.అయితే ఇది మరింత దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.