దేశవ్యాప్తంగా వర్షాలు ఎలా కురుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వంకలు, వాగులు పెరిగిపోయి అన్ని నిండిపోతున్నాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా ఓ ప్రాంతంలో కొండచెరియలు విరిగిపడ్డాయి.అలా కొండచెరియలు విరగడం కారణంగా ఎవరికి ఎటువంటి హాని జరగలేదు కానీ అందులో నుంచి బయటపడ్డ 12 పుర్రెలు, ఎముకలు, నగలే అందరిని భయపెడుతున్నాయి.
ఈ ఘటన మిజోరాంలోని మమిత్ జిల్లాలో చోటుచేసుకుంది.శుక్రవారం రోజు కొండా చెరియలు కూలిపోయాయి.దీంతో అక్కడికి వెళ్లగా అక్కడ 12 పుర్రెలు, ఎముకలు, ఆభరణాలు, స్మోకింగ్ పైప్, కొన్ని పాత్రలు దొరికాయి.ఈ విషయాన్నీ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లాల్రోజామా వెల్లడించారు.
ఈ విషయంపై అతను మాట్లాడుతూ. ”ఈ పుర్రెలు, ఎముకలు, బంగారు ఆభరణాలు ఏకాలం నాటివో నేను సరిగ్గా చెప్పలేను.సరైన వివరణ లేకుండా వాటి కాలాన్ని అంచనా వెయ్యలేము.అందుకే ఈ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయను” అని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
ఇంకా అక్కడ దొరికిన వస్తువులు అన్నింటిని కూడా ఫోరెన్సిక్ విభాగానికి పంపుతున్నట్లు అయన తెలిపారు.