4 వ తరగతి పరీక్షలకు హాజరైన 104 ఏళ్ల బామ్మ

లక్ష్యం మంచిది అయితే వయసు అనేది అడ్డురాదు అన్న విషయం ఈ బామ్మను చూస్తే అర్ధం అవుతుంది.చదువుకోవాలన్న లక్ష్యం తో ముందుకు సాగుతున్న ఈ బామ్మ వయసు 104 సంవత్సరాలు.

 104 Years Old Women Appear For 4th Standardexams In Kerala-TeluguStop.com

ఇంత వయస్సు ఉన్న ఈ బామ్మ ఇప్పుడు 4 వ తరగతి చదవడానికి సిద్దపడింది.కేరళకు చెందిన ఈ బామ్మ మహిళా అక్షరాస్యత మిషన్ నిర్వహించిన నాలుగవ తరగతి పరీక్షకు హాజరయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ బామ్మా పేరు భగీరథి అమ్మ, అయితే చిన్నప్పుడే తన తల్లి చనిపోవడం, తోబుట్టువులను చూసుకోవల్సిన బాధ్యత తనపై ఉండటంతో చిన్నప్పుడు చదవడం కుదరలేదని, ఆ తరువాత పెళ్లి భాద్యతలు, చిన్న వయసు లోనే భర్త కోల్పోవడం వంటి ఘటనలతో ఆమె బాధ్యతలు పెరిగిపోయాయి.30 ఏళ్లలోనే భర్తను కోల్పోవడం తో తన ఆరుగురు పిల్లల భాద్యత ఈమె పై పడడం తో చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ చదువుకోలేకపోయిందట.అయితే ఇప్పుడు ఈ 104 ఏళ్లు నిండిన ఈ బామ్మా తన చిన్నప్పటి ఆశ తీర్చుకోవాలని ఇలా ఈ బామ్మా మహిళా అక్షరాస్యత మిషన్ ద్వారా 4 వ తరగతి పరీక్షలు రాయడానికి హాజరైంది.

Telugu Standardexams, Aksrasyatha, Kerala-

ఈ వయసులో కూడా బామ్మకు అద్భుతమైన జ్ఞాపకశక్తి, పదునైన కంటిచూపు ఉన్నందున ఈ పరిక్ష రాయడం కుదిరిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఎప్పుడో తన 9వ సంవత్సరంలో మూడవ తరగతి వరకూ చదివివ ఈ బామ్మ ఇఫ్పుడు 105వ ఏట నాలుగవ తరగతి చదవం చాలా సంతోషంగా ఉందని చెబుతుంది.అయితే ప్రస్తుతం ఈ బామ్మకు ఆధార్ కార్డు కూడా లేకపోవడం తో ఆమెకు వితంతువు ఫించను గానీ,వృద్ధాప్య ఫించన్ గానీ ఏమి లభించడం లేదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube