టెలి రంగములు జియో వచ్చాక అనేక మార్పులు సృష్టించింది.ఒక విధంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ లకు బానిస చేసింది.
జనాల్లో లో స్మార్ట్ ఫోన్ సగానికి సగం పైగా పెరిగిందంటే కారణం టెలికాం రంగంలో జియో రావడమే.తక్కువ ధరలకే ఇంటర్నెట్ డేటా ను ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని ప్రజల కోసం జియో ప్రవేశపెట్టింది.
దీనితోపాటు 700 రూపాయలకు జియో ఫోన్ ఉచిత కాలింగ్.యూజర్ల కోసం జియో కొత్త కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది.
జియో దెబ్బకు పలు నెట్వర్క్ కంపెనీలు దిగువచ్చాయి, కొన్ని నెట్ వర్క్ కంపెనీలు విలీనం కూడా అయిపోయాయి.కొన్ని గత్యంతరం లేక మొబైల్ నెట్ వర్క్ లు ఇంటర్నెట్ డేటా ధరలను తగ్గించాయి.
2019 సెప్టెంబర్ లో జియో ఫైబర్ ను ప్రకటించిన రిలయన్స్ మరో సంచలనాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.జియో టెలికాం సంస్థ దేశవ్యాప్తంగా జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను పలు ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది.
జియో ఫైబర్ లో ఉచిత హెచ్ డి వాయిస్ కాల్స్ హైస్పీడ్ ఇంటర్నెట్ టీవీ వీడియో కాలింగ్ సేవలను అందిస్తుంది.జియో ఫైబర్ బ్రాడ్ బ్రాండ్ లో తక్కువ ధరలో 900,1499,2499 డేటా ప్యాక్ లు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. తాజాగా jio ఫైవ్ తన కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రవేశపెట్టింది.1 టీబీ డేటా (1000 జీబీ) ను కేవలం రూ.199 కే అందిస్తోంది.వ్యాలడిటీ 7 రోజులు మాత్రమే.డేటా ప్యాక్ ముగిసిన తర్వాత 1MBPS స్పీడ్ వస్తుంది.