భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో ప్రాణత్యాగాలు ఉన్న కూడా భారత మాత నుదుటిపై రక్తపు తిలకంలా మారిన జలియన్ వాలా భాగ్ ఘటన ఇప్పటికి ప్రతి భారతీయుడు కళ్ళ ముందు ప్రత్యక్షంగా మెదులుతుంది.ఏప్రిల్ 13 1919లో జరిగిన ఈ ఘటనలో శాంతియుతంగా సమావేశం అయిన భారత స్వాతంత్ర్య వీరులపై బ్రిటిష్ పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ ఘటన తర్వాత భారతీయుల స్వాతంత్ర్య కాంక్ష మరింత బలపడింది.
బ్రిటిష్ వారికి ఆ ఘటన ఓ పీడకలగా మారిపోయింది.జలియన్ వాలా భాగా దురాగతంకి పాల్పడిన జనరల్ డయ్యర్ ని తరువాత భారత స్వాతంత్ర్య విప్లవ వీరులు హత్య చేసారు.
భారత దేశంలో ఓ రక్తాక్షర చరిత్రగా మిగిలిపోయిన ఈ ఉదంతంగా వందేళ్ళు అయ్యింది.ఇక కొద్ది రోజుల క్రితం బ్రిటన్ ప్రభుత్వం కూడా ఈ ఉదంతం చాలా ఘోరమైనదిగా చెబుతూ క్షమాపణలు కూడా చెప్పింది.
మొత్తానికి జలియన్ వాలాభాగ్ ఉదంతం వందేళ్ళ భారతంలోనే కాదు.చరిత్ర ఉన్నంత వరకు ఓ రక్తాక్షర చరిత్రగా మిగిలే ఉంటుంది.