తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో కీలకంగా రాణిస్తుంది.వ్యాక్సినేషన్ ఫై అవగాహన విషయంలో ప్రజలు అధికారులు తెలంగాణ రాష్ట్రాన్ని 100% వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా మలచడానికి కృషి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే దేశంలో థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేయడానికి దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేశాయి.
కేంద్రం ఫ్రీ గా వ్యాక్సినేషన్ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పీడ్ గా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.ఈ క్రమంలో త్వరలో హైదరాబాద్ నగరం 100% వ్యాక్సినేషన్ జరిగిన నగరంగా అవతరించనున్నట్లు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
జిహెచ్ఎంసి పరిధిలో ఇంటింట సర్వే నిర్వహించడం మాత్రమే కాక మొబైల్ టీకా కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలియజేశారు.ఏదిఏమైనా మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ నగరం మొత్తం వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన నగరంగా అవతరించనున్నట్లు పేర్కొన్నారు.