ప్రపంచవ్యాప్తంగా అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ కోరలు చాచిన సంగతి తెలిసిందే.ఈ కోరల్లో చిక్కుకుని ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు విడిచారు.
చైనాలో ప్రాణంపోసుకున్న ఈ మహమ్మారిని అంతం చేసే సరైన వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు.రష్యా వ్యాక్సిన్ విడుదల చేసి.
పలు అనుమానాల వల్ల దానివైపు కూడా ఎవరూ చూడటం లేదు.
ఇక కరోనా మహమ్మారి ఎటు నుంచి వచ్చి.
ఎలా కబలిస్తుందో కూడా ఊహించలేకపోతున్నారు.ఇలాంటి తరుణంలో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు మరచి కొందరు చిక్కుల్లో పడుతున్నారు.
తాజాగా ఓ ఊరి లో 500 మంది జనాలు ఉండగా.అందులో వంద మంది కరోనా బారిన పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్కే పురం అనే ఊరిలో ఇలా జరిగింది.అయితే ఒకే ఊరిలో ఇంత మంది ఒకేసారి కరోనా బారిప పడటం వెనక కారణం ఏంటని ఆరా తీయగా.
దినకర్మ సహపంక్తి భోజనాలే అని అధికారులు తెలుసుకున్నారు. ఆ భోజనాల్లో పాల్గొన్నవారిలో వంద మందికి కరోనా సోకిందట.
దీంతో మిగిలిన గ్రామస్తులు కూడా కరోనా టెస్ట్లు చేయించుకున్నారు.ఆ రిపోర్ట్స్ రావాల్సి ఉంది.
మరి వీరిలో ఇంకెంత మందికి కరోనా ఉంటుందో అన్నది హాట్ టాపిక్గా మారింది.మరోవైపు కరోనా భయంతో ఆ ఊరి ప్రజలు బయట కాలు పెట్టడానికి కూడా జంకుతున్నారు.