గత సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన బర్కత్పురకు చెందిన పదిహేడేళ్ల మేఘన కాలేజీకి వెళ్లేందుకు బస్స్టాప్ వద్దకు నడుచుకుంటూ వెళ్తోంది.ఇంకా అదే ప్రాంతానికి చెందిన 19ఏళ్ల భరత్ అనే యువకుడు తన ప్రేమను అంగీకరించని ఆ యువతిని చంపేయాలని ఆమె కోసం ఓమూల ఉన్నాడు.
ఇంకా ఆమె అతనికి కనిపించగానే రాక్షసుడిలా మారి వరుసగా పదిహేడు సార్లు కత్తితో పొడిచాడు.రక్తం కారుతూ కోన ఊపిరితో కొట్టుకుంటున్న ఆమెను వదలకుండా పొడిచి అక్కడ నుండి పరారయ్యాడు.
అతను పారిపోగానే రక్తపు మడుగులో పది ఉన్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.చావు నుండి అయితే బయటపడింది కానీ ఆమె కళలు అన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయి.
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం దెబ్బ తినడంతో ఆమె జీవితం చీకటిమయం అయ్యింది.అయితే ఈ దారుణ ఘటన జరిగి సంవత్సరంపైనే అవుతుంది.
ఇంకా ఈ కేసులో నిందితుడికి సోమవారం కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.ఇంకా ఈ సందర్భంగా బాధితురాలు తండ్రి మాట్లాడుతూ.ఈ ఘటన కారణంగా తన కూతురు మానసికంగా కుంగిపోయిందని.పాత గాయాలను గుర్తు చేయడం ఇష్టం లేక దోషికి శిక్ష పడిన విషయాన్ని కూడా చెప్పలేదని అయన ఆవేదన వ్యక్తం చేశారు.