షార్జాలో విషాదం చోటు చేసుకుంది.ఓ భారతీయు బాలుడు అనుమానాస్పద స్థితిలో తన గదిలో శవమై తేలాడు.
డేవిడ్ పున్నక్కల్ అనే పదేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి షార్జాలో నివసిస్తున్నాడు.గ్రేడ్-VI చదువుకుంటున్న డేవిడ్ మంగళవారం సాయంత్రం తన బెడ్రూమ్లో విగతజీవిగా కనిపించాడు.
మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు డేవిడ్ తన ఈ- లెర్నింగ్ స్టడీస్ పూర్తి చేసి తన గదిలో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లాడని బాలుడి బంధువు సునీల్ దేవాసియా చెప్పారు.తన గదిని లాక్ చేసుకున్నాడని, అతని తల్లిదండ్రులు ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో వారు బెడ్రూమ్ తలుపులు బద్ధలు కొట్టి చూడగా నేలపై నిర్జీవంగా కనిపించాడని దేవాసియా తెలిపారు.చిన్నారి తల్లి వృత్తి రీత్యా నర్సుగా పనిచేస్తున్నారు.
ఆమె బాలుడిని బతికించేందుకు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారని సునీల్ తెలిపారు.
అల్ ఘర్బ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని షార్జా పోలీసులు చెప్పారు.దర్యాప్తులో భాగంగా డేవిడ్ తల్లిదండ్రులను విచారించే అవకాశం ఉందని.
అలాగే చిన్నారి మరణానికి కారణం తెలుసుకునేందుకు గాను మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు.మరోవైపు డేవిడ్ మరణాన్ని దుబాయ్లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.
ఈ ఘటనకు సంబంధించి కాన్సులేట్కు సమాచారం ఇచ్చినట్లు భారత కాన్సుల్ జనరల్ విపుల్ బుధవారం పేర్కొన్నారు.