చాలా మంది ఏడుకొండల వాడి దర్శనం కోసం తిరుమల వెళుతూ ఉంటారు.తిరుమల వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కొన్ని విషయాలను తెలుసుకుంటే యాత్ర సులభంగా అవుతుంది.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
1.తిరుమలలో స్వామివారిని దర్శించటానికి ముందు పుష్కరిణిలో స్నానము చేసి వరాహ స్వామికి దర్శనం చేసుకోవాలి.
2.పుష్కరిణిలో స్నానము చేసే సమయంలో సబ్బు,షాంపూ వంటి వాటిని ఉపయోగించకూడదు.
3.స్వామివారి దర్శనానికి తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులను ధరించాలి.
4.తిరుమలలో ఆచార,సంప్రదాయాలను పాటించాలి.
5.తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం.
6.తిరుమల ఆలయంలోకి సెల్ ఫోన్, కేమెరా, ఆయుధాలు వంటి వాటిని తీసుకువెళ్లకూడదు.
7.తిరుమల సమీపంలోని ఆకాశ గంగ, పాపవిశానం తీర్థాల్లోనూ స్నానం చేయండి.
8.తిరుమల ఆలయంలో ఓం శ్రీ వేంకటేశాయనమ అని మనస్సులో శ్రీవారిని స్మరించాలి.సాధ్యమైనంతవరకు నిశబ్దంగా ఉండాలి.
9.తిరుమలలో ఉన్నప్పుడు అపరిచితులను నమ్మి వసతి గృహాల్లోకి రానీయకూడదు.
10.శ్రీవారి దర్శనం కోసం , వసతి కోసం దళారీలను ఆశ్రయించకూడదు.