మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ మధ్యనే ఒక సినిమా స్టార్ట్ అయినా విషయం తెలిసిందే.ఈ సినిమాను ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.
శంకర్ సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన సినిమాలో నటించే అవకాశం వస్తే ఆ నటుడి దశ తిరిగినట్టే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు.
ఇక ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఏదొక రూమర్స్ వస్తూనే ఉన్నాయి.శంకర్ సినిమా అంటే మినిమమ్ 150 కోట్లు దాటిపోతుంది.
ఎందుకంటే ప్రతి చిన్న సన్నివేశానికి కూడా కోట్లు ఖర్చు పెడతారు.ఇక తాజాగా వస్తున్న రూమర్ ఏంటంటే ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉందట.
ఆ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది.అయితే ఇప్పుడు ఆ సన్నివేశానికి శంకర్ కోట్ల రూపాయలను ఖర్చు చేయ బోతున్నాడట.
ఈ సినిమాలో ఒక భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ ఉందట.ఈ ట్రైన్ ఎపిసోడ్ కోసం శంకర్ ఏకంగా 10 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.ఈ ఎపిసోడ్ సినిమాలో కీలక సమయంలో వస్తుందట.
అందుకే ఈ యాక్షన్ ట్రైన్ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలెట్ అని ప్రచారం జరుగుతుంది.ఈ భారీ యాక్షన్ సన్నివేశంలో రామ్ చరణ్ తో పాటు వందల మంది ఫైటర్స్ పాల్గొంటారట.అందుకే అంత భారీ ఖర్చు అవ్వనుందట.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది.ఇక అంజలి, సునీల్, శ్రీకాంత్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.