ఎన్టీఆర్ హోస్ట్ గా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో రేటింగ్స్ వారం వారానికి తగ్గుతున్నాయి.అర్బన్ ఏరియాల్లో ఈ షోకు పరవాలేదనిపించే విధంగా రేటింగ్స్ వస్తున్నా రూరల్ ఏరియాల్లో మాత్రం ఎక్కువగా రేటింగ్స్ రావడం లేదని వినిపిస్తోంది.
మరోవైపు ఈ షోలో ఇప్పటివరకు ఎవరూ కోటి రూపాయలు గెలుచుకోలేదనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఒక వ్యక్తి మాత్రం కోటి రూపాయలు గెలుచుకున్నాడని తెలుస్తోంది.
గత కొన్ని వారాలుగా ప్రసారమవుతున్న ఈ షోను సక్సెస్ చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతగానో కష్టపడుతున్నారు.ఇప్పటివరకు షోలో ఒక్క కంటెస్టెంట్ కూడా 50 లక్షల రూపాయలు గెలుచుకోలేదు.
కొంతమంది 25 లక్షల రూపాయలు గెలుచుకుంటే మరి కొందరు 25 లక్షల రూపాయల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక క్విట్ చెప్పి షో నుంచి వెళ్లిపోయారు.తర్వాత రోజుల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఒక యువకుడు కోటి రూపాయలు గెలుచుకున్నాడని సమాచారం.
అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందనే సంగతి తెలియాల్సి ఉంది.
మరోవైపు ఈ షోలో ప్రముఖ సెలబ్రిటీలు సైతం పాల్గొంటున్నారు.రాఘవేంద్రరావు, మహేష్ బాబు ఈ షోలో పాల్గొనగా ఆ ఎపిసోడ్స్ ఎప్పుడు ప్రసారమవుతాయో తెలియాల్సి ఉంది.యువకుడు తారక్ అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పి ఎన్టీఆర్ ను సైతం అవాక్కయ్యేలా చేశాడని తెలుస్తోంది.
షో మొదలైన తర్వాత కోటి రూపాయలు గెలుచుకున్న ఆ యువకుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.ప్రతిభ ఉన్న యువతీయువకులకు ఈ షో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.టాలెంట్ ఉన్నవాళ్లు ఈ షో ద్వారా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని లక్షల్లో సంపాదించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.డిసెంబర్ నెల తొలి వారం వరకు జెమినీ ఛానల్ లో ఈ షో ప్రసారం కానుంది.