ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఏపీ నూతన సీ ఎం జగన్ మాజీ ఎమ్మెల్యే లకు,మంత్రులకు కేటాయించిన గన్ మెన్ లను కుదించాలి అని అనుకోవడం ఇలా ఈ ఘటన నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు తమకు కేటాయించిన గన్ మెన్ లను వెనక్కి పంపుతున్నారు.మొన్నటి మొన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గన్మెన్ను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.
అయితే ఇంకా ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా తనకు కేటయించిన గన్మెన్ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది.టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న ఆయనకు 4+4 గన్మెన్ సౌకర్యం ఉండేది.
అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంత ఘోరంగా ఓటమి పాలైంది.దీనితో అక్కడ సీన్ మారిపోయింది.వైసీపీ అధికారంలోకి రావడం, మాజీ లకు గన్ మెన్ లను కుదించడం వంటి చర్యలు చేపట్టారు.
దీనితో ఆయన ఐదోసారి టెక్కలి ఎమ్మెల్యే గా ఎన్నికై న కారణంగా అచ్చెన్నాయుడు కు ఏపీ సర్కార్ గన్ మెన్ ను 2+2 కు కుదించింది.అయితే మొన్నటివరకు అదే కొనసాగగా, అయితే నిన్న మాత్రం ఆయన భద్రత కోసం ఒకే ఒక గన్మెన్ను పంపడం తో అసలు నాకు గన్ మెన్ అవసరమే లేదంటూ తిప్పి పంపించేశారట.ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ ఆయనకు కేవలం ఒక్క గన్ మెన్ ను కేటాయించడం పై అచ్చెన్నాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
మరి దీనిపై ఇరు పార్టీ ల మధ్య ఎలాంటి మాటలు తూటాలు పేలతాయో చూడాలి.