మనిషికి ఉన్న అన్ని బంధాలలో కంటే స్నేహానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది.భార్యకి ,తల్లి తండ్రులకి చెప్పుకోలేని ఎన్నో విషయాలు ఒక్క స్నేహితుడికే చెప్పుకుంటారు.
అలాంటి స్నేహాన్ని సైతం కొంత మంది బ్రష్టు పట్టిస్తున్నారు.స్నేహం యొక్క విలువని మర్చి పోయి ఆ భందానికి మాయని మచ్చ తీసుకు వస్తున్నారు.వివరాలలోకి వెళ్తే…
చెన్నై రాష్ట్రంలోని చెన్నైలో గల టీ నగర్ సౌత్బోగ్ రోడ్డు అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి వాచ్మెన్ గా ఎప్పటి నుంచో చేస్తున్నాడు.అతడికి భార్య, పిల్లలున్నారు.అయితే అతడు ఉదయం సమయంలో అపార్ట్మెంట్ లో పనిచేస్తాడు.రాత్రిపూట అపార్ట్ మెంట్కు దగ్గరలోని ఒక సంస్థలో వాచ్మెన్ గా చేస్తున్నాడు అయితే ఈ క్రమంలోనే అతడు తన స్నేహితుడికి ఉద్యోగం లేదని తెలుసుకుని మరీ తన స్నేహితుడు అయిన వినోద్ ను తాను వాచ్మెన్ గా ఉంటున్న అపార్ట్మెంట్కు పక్కనే ఉన్న భవనంలో వాచ్మెన్ గా నియమించాడు
అయితే దారి చూపించిన స్నేహితుడి భార్య పైనే వినోద్ కన్ను పడింది.
అతడు ఇంట్లో లేని సమయం చూసుకుని తన స్నేహితుడి భార్యపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు.ఆమెను బెదిరించి మరీ అత్యాచారం చేశారు.వివాహిత కేకలు వేస్తే బెదిరింపులకు పాల్పడి మరీ అత్యాచారానికి దిగాడు.వినోద్ స్నేహితుడు రాత్రిపూట తాను పనిచేసే ప్రైవేట్ కంపెనీలో విధులకు వెళ్ళాడు.
అయితే అప్పటికే తన స్నేహితులతో కలిసి వినోద్ మద్యం తాగారు.నేరుగా తనకు ఉద్యోగం ఇప్పించిన స్నేహితుడి ఇంటికి వెళ్ళి తలుపుకొట్టాడు.
అయితే ఈ సమయంలో తన భర్త వచ్చాడని తలుపులు తీసిన ఆమె ని తోసుకుని లోపలి వెళ్లి.ఆమె పిల్లల్ని చంపుతానని బెదిరించి చివరికి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో పిల్లలను రక్షించుకొనేందుకు బాధితురాలు నోరు మెదపలేదు.రాత్రి పూట విధుల నుండి ఇంటికి వచ్చిన భర్తకు బాధితురాలు అసలు విషయాన్ని చెప్పింది…దాంతో ఆమె భర్త నిందితుడు వినోద్ పై పోలీసులకి ఫిర్యాదు చేశాడు.