సంచలన వ్యాఖ్యలు చేసిన మనీశ్ సిపోడియా

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిపోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ ని చంపేయాలని చూస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.

 Sisodia Takes On Pm Modi After Kejriwal Is Slapped Duringroadshow-TeluguStop.com

శనివారం ఢిల్లీ లోని మోతీ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీ పై ఒక ఆగంతకుడు అకస్మాత్తుగా ఆయన వాహనం పైకి ఎక్కి మరి దాడి చేశాడు.

దీనితో అందరూ ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు.వెంటనే ఆ అగంతకుడిని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగించారు.

అయితే కేజ్రీ పై దాడి చేసిన వ్యక్తి ని సురేష్ గా పోలీసులు గుర్తించారు.కైలాష్ పార్క్ ప్రాంతంలో అతడు స్పేర్ పార్ట్స్ విక్రయిస్తూ ఉంటాడని పోలీసులు తెలిపారు.

అయితే అతడు కేజ్రీ పై దాడిలో ఎందుకు పాల్పడ్డాడు అన్న దానిపై ఎలాంటి సమాచారం.అతడిని పట్టుకున్న సెక్యూరిటీ పోలీసులకు అప్పగించారు.

కేజ్రీ వాల్ పై ఈ విధంగా భౌతిక దాడికి పాల్పడడం ఇదే తొలిసారి ఏమీ కాదు.ఢిల్లీ సి ఎం గా 2014 లో ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీ పై ఇప్పటివరకు 5 సార్లు దాడులు చోటుచేసుకున్నాయి.

గతంలో ఆయనపై చెప్పులు విసరడం,ఇంకు జల్లడం వంటి చర్యలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా ఈ దాడి తో కేజ్రీ కి మరోసారి పరాభవం తప్పలేదు.

అయితే ఈ ఘటన పై మనీశ్ సిపోడియా మాట్లాడుతూ….కేజ్రీ పై దాడి వెనుక ప్రధాని నరేంద్రమోడీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ల హస్తం ఉందని,వాళ్లిద్దరూ కేజ్రీ ని చంపేయాలని చూస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube